AP CM Jagan | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
అసలు ముఖ్యమంత్రి జగన్ డిగ్రీ పూర్తి చేశారో లేదో చెప్పాలని భూమిరెడ్డి విమర్శించారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటే పట్టభద్ర ఓటరుగా ఓటు ఎందుకు నమోదు చేయించుకోలేదని ప్రశ్నించారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న భూమి రెడ్డి మాట్లాడుతూ.. జగన్పై విమర్శలు గుప్పించారు.
జగన్ డిగ్రీ పూర్తి చేసి ఉంటే పులివెందులలో ఎందుకు ఓటరుగా నమోదు చేసుకోలేదని ప్రశ్నించారు. డిగ్రీ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల సమయంలో తన అఫిడవిట్ లో జగన్ పేర్కొన్నారని గుర్తు చేసిన ఆయన.. మరి గ్రాడ్యుయేట్ గా ఎందుకు నమోదు చేయించుకోలేదని జగన్ను ప్రశ్నించారు. ఓటు కూడా నమోదు చేసుకుని వ్యక్తి ‘మా అభ్యర్థికి ఓటు వేయండి’ అని ఎలా అడుగుతారని జగన్ ను నిలదీశారు. ‘శాసన మండలి రద్దు.. వద్దు’ అని చెప్పిన వ్యక్తి.. అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపడం.. ఇచ్చిన మాట తప్పడం కాదా? అని మండిపడ్డారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?
Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..
Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు
Oscars 2023 | అకాడమీ అవార్డ్స్లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్కు ఆస్కార్ వచ్చేసింది