Home Latest News Fire Accident | సికింద్రాబాద్ అగ్రిప్రమాదం ఘటనలో ముగ్గురు సజీవ దహనం.. బిల్డింగ్ కూల్చివేతపై నిర్ణయం...

Fire Accident | సికింద్రాబాద్ అగ్రిప్రమాదం ఘటనలో ముగ్గురు సజీవ దహనం.. బిల్డింగ్ కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్న అధికారులు

Fire Accident | సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేట పరిధిలో గురువారం జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందారు. డెక్కన్ స్పోర్ట్స్ బిల్డింగ్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు 12 గంటల పాటు భవనం మొత్తం అగ్నికీలల్లోనే ఉంది. అయితే ఈ ప్రమాదంలో భవనంలో ఉన్న బిహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్ సజీవ దహనమయ్యారు.

సెల్‌ఫోన్ లొకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. వీటి ఆధారంగా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రస్తుతానికి వీలు కాదు అని వెల్లడించారు. మంటల్లో కాలిన భవనం వేడిగా ఉందని, నీటిని చల్లిన తర్వాతే వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని అన్నారు.

కాగా, భవనం పరిస్థితిని అంచనా వేసేందుకు నిట్ డైరెక్టర్ రమణారావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. భవనాన్ని కచ్చితంగా కూల్చివేయాల్సిందేనని చెప్పారు. అయితే ఆరు అంతస్తుల భవనాన్ని కూలిస్తే పక్కనున్న భవనాలకు ప్రమాదం పొంచి ఉంటుందని అన్నారు. అయితే భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్‌ విసుర్లు

Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Quelea Birds | బుల్లి పిట్టలపై కెన్యా యుద్ధం.. ఆరు లక్షల పక్షులను చంపడమే టార్గెట్‌

Exit mobile version