Odisha Heath Minister | ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ పై ఓ ఎస్సై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. హూటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒడిశాలోని ఝూర్సుగూడా జిల్లా బజరంగ్ టౌన్లో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు కిషోర్ దాస్ వెళ్తుండగా గోపాల్ దాస్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ నుంచి పాయింట్ బ్లాంక్ లో ఆయన పై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన వెంటనే గోపాల్ దాస్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంత్రికి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం విచారకరమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్లాన్ ప్రకారమే చేసిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది.
ఈ ఘటనతో బిజూ జనతాదళ్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం ఖండించదగినదని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రలోని ఓ ఆలయానికి కిషోర్ దాస్ కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని విరాళంగా ఇచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్
Tarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు
Rajinikanth | ఆమె వల్లే అన్ని అలవాట్లు మానేశా.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు