Rishabh Pant | డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషభ్ పంత్ను మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలిస్తున్నారు. గత వారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ను డెహ్రాడూన్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కోలుకున్నాక ఐసీయూ నుంచి ప్రైవేటు వార్డుకు తరలించారు. అయితే మరింత మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలిస్తామని ఢిల్లీ క్రికెట్ బోర్డు డైరెక్టర్ శ్యామ్ శర్మ వెల్లడించారు.
బీసీసీఐ వైద్యులు పంత్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించి ముంబైకి తరలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే లండన్కు తరలించాలని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
ఏం జరిగింది?
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్లకు పంత్ సెలెక్ట్ కాలేదు. దీంతో ఆ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుదామని అనుకున్నాడు. క్రిస్మస్కు దుబాయ్లో ధోనీ కుటుంబంతో సరదాగా గడిపిన పంత్.. వెంటనే ఇండియా వచ్చాడు. డిసెంబర్ 31 తెల్లవారుజామున ఢిల్లీ నుంచి స్వగ్రామం రూర్కీకి తన బీఎండబ్ల్యూ కారులో బయల్దేరాడు. అయితే ఢిల్లీ – డెహ్రాడూన్ హైవేపై హరిద్వార్ జిల్లా మంగ్లూర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారు అద్దాలు పగులగొట్టుకుని పంత్ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ తల, వీపు, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే పంత్ను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స అందించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి ప్రైవేటు వార్డుకు తరలించారు.
Read More Articles:
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?