Rain alert for Telangana | తెలంగాణకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( IMD ) ఒక ప్రకటనలో తెలిపింది. పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలకు తోడు చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత పెరిగుతుందని హెచ్చిరించింది.
బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురస్తున్నాయని పేర్కొంది. మాండౌస్ ( Mandous cyclone ) తుఫాను ప్రభావంతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఆదివారం ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. అల్వాల్, సికింద్రాబాద్, జీడిమెట్ల, ట్యంక్బండ్, లక్డీకపూల్, నాంపల్లి, సుల్తాన్ బజార్, కోఠి, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
Read More Articles |
YS Sharmila Health Update | వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలింపు