Hyderabad woman kidnapped by 100 men in Adibatla | రంగారెడ్డి జిల్లాలో యువతి కిడ్నాప్ సినిమా స్టోరీని తలపించింది. సినిమా స్ట్లైల్లో ఎంట్రీ ఇచ్చిన దాదాపు 100 మంది యువకులు.. ఓ ఇంటిపై దాడి చేసి యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డువచ్చిన కుటుంబసభ్యులపైనా దాడి చేసి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. సినిమాను తలపించిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కిడ్నాపర్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఆధిభట్లకు చెందిన ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె వైశాలి డెంటల్ విద్యనభ్యసిస్తోంది. వైశాలిని ఓ టీ చైన్ బిజినెస్ యజమాని నవీన్ రెడ్డి ప్రేమించాడని, ఆ యువకుడే ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రెడ్డి, యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారట. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో యువతి అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి కోసం ఆ యువకుడు వేధిస్తూనే ఉన్నాడు. శుక్రవారం యువతికి సంబంధం చూడటానికి పెళ్లివాళ్లు వస్తున్న విషయం తెలుసుకుని.. ఇంటిపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేశాడు.
యువతి తల్లిదండ్రుల వాదన మరోలా..
యువతి తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. గతంలో పెళ్లి సంబంధం కోసం నవీన్ రెడ్డి వచ్చాడని, ఆ సంబంధం నచ్చకపోవడంతో దూరం పెట్టామని చెప్పారు. కానీ ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని వేధిస్తూనే ఉన్నాడని అన్నారు. శుక్రవారం తమ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడటానికి వస్తున్న విషయం తెలుసుకుని గుండాలతో దాడి చేసి అమ్మాయిని కిడ్నాప్ చేశాడని చెబుతున్నారు.
వైశాలిని కిడ్నాప్ చేసిన తర్వాత యువతి తల్లిదండ్రులు నవీన్ రెడ్డి టీ స్టాల్ ను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దాని పక్కనున్న రేకుల షెడ్డును జేసీబీతో కూలగొట్టారు.
Read More Articles |
CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ
vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?
Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్ ప్రజలు కొత్త డిమాండ్లు