BCCI Selection Committee | బీసీసీఐ క్రికెట్ జట్టు కొత్త సెలక్షన్ కమిటీని ప్రకటించింది. పురుషుల జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా మరోసారి చేతన్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ( BCCI ) ప్రకటించింది. ప్యానల్ సభ్యులుగా సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్, శివ్ సుందర్ దాస్లను బీసీసీఐ నియమించింది.
ఈ మేరకు బీసీసీఐ అఫీషియల్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరా పరాజయం తర్వాత అప్పటి సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించగా 50 అప్లికేషన్లు వచ్చాయి. క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూ చేసి ఎంపికైన వారి జాబితాను బీసీసీఐకి పంపించింది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చైర్మన్ కు వేతనం ఏడాదికి రూ.1.25 కోట్లు ఉండగా.. సెలెక్టర్లకు కోటి రూపాయలు ఉంది.
Read More Articles:
Kerala Biryani | బిర్యాని తిని 20 ఏళ్ల యువతి మృతి.. వారంలో ఇది రెండో ఘటన.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
Sankranti Holidays | గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం