Rishabh Pant | పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. పంత్ నుదురు చిట్లిందని, వీపుపై కాలిన గాయాలు ఉన్నాయని బీసీసీఐ తెలిపింది. కుడి మోకాలు లిగ్మెంట్ కూడా జరిగినట్లు ఎక్స్రేలో తేలిందన్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, ఇంకా స్కానింగ్లు చేయాల్సి ఉందని తెలిపింది.
పంత్ కుటుంబ సభ్యులతో ఇప్పటికే మాట్లాడామని, రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. వైద్యులతో మాట్లాడినట్లు తెలిపిన జైషా.. మరిన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, పంత్ పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పంత్కు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు.
మరోవైపు పంత్ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అంతకుముందు పంత్కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఆశిష్ మాట్లాడారు. పంత్ ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని స్పష్టం చేశారు. కాగా, ప్రమాద సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. వేగంగా ఢివైడర్ను ఢీకొట్టడం వల్లనే కారులో మంటలు చెలరేగినట్లు వివరించారు.
Read More Articles |
Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!
Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు