YS Jagan | ఆంధ్రప్రదేశ్లో జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తోడు ఉంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్ లా నేస్తం పథకం మూడో విడతలో భాగంగా రూ.1,00,55,000 నిధులను విడుదల చేశారు. ప్రతి నెల రూ.5 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2011 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో వీటిని జమ చేయనున్నారు.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం నిధులు జమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా లా నేస్తం విడుదల చేస్తున్నామని తెలిపారు. లాయర్లకు ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపేందుకే లా నేస్తం అని అన్నారు. లా పట్టా పొందిన తరువాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే బుధవారం సీఎం జగన్ విడుదల చేసిన నిధులతో కలిపి ఇప్పటి వరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం మొత్తం రూ. 35.40కోట్లకు చేరింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో కార్సస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!
Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!
Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?
NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్గా చనిపోతున్నారెందుకు?
Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి
Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం