Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బేలేశ్వర్ మహాదేవ్ ఝూలేలాల్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 35కు చేరింది. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కల్యాణం చూడటానికి వచ్చిన భక్తులు ఆలయంలోని మెట్ల బావి మీద ఎక్కి వీక్షించారు. ఈ క్రమంలో మెట్లబావి పైకప్పు కూలిపోయింది. 50 అడుగులకు పైగా ఉన్న బావిలో భక్తులు పడిపోయారు. వీరిలో 35 మంది మృతి చెందారు. మరో 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పురాతన ఆలయం కావడం.. పెద్దఎత్తున భక్తులు హాజరు కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో బావి మీద కూర్చొని కల్యాణం వీక్షించారు. ఈ క్రమంలోనే దుర్ఘటన జరిగింది. ప్రమాదం గురించి తెలియగానే ఆలయానికి పరుగున వచ్చిన పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో బావిలో పడ్డ భక్తులను బయటకు తీసుకొచ్చారు. అయితే 50 అడుగుల లోతు ఉండటం.. ఒకరిపై మరొకరు పడటంతో భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్పాట్ లోనే 12 మంది దుర్మరణం చెందారు. చికిత్స పొందుతూ మరికొందరు మరణించారు. ఈ విషయాన్ని ఇండోర్ జిల్లా కలెక్టర్ ఇళయరాజా ధ్రువీకరించారు.
ఈ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఫోన్ చేసి పరిస్థితి గురించి ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్ సారథిగా భువనేశ్వర్ కుమార్
PL2023 | బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్కు రంగం సిద్ధం.. ఐపీఎల్ తొలి పోరులో గుజరాత్తో చెన్నై ఢీ
Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు
Moto G13 | రూ.10వేలకే 50MP కెమెరా, డాల్బీ స్పీకర్లతో అదిరిపోయే స్మార్ట్ఫోన్