Nandamuri Balakrishna | నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకోవడం ఇప్పుడు అందర్నీ కలిచివేస్తోంది. జానకీరామ్ మరణం తర్వాత నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు అకస్మాత్తుగా చనిపోతుండటంతో రకరకాలు వదంతులు వస్తున్నాయి. నందమూరి వంశానికి ఏదో శాపం తగిలిందని.. అందుకే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న అంత్యక్రియలకు ముందు ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మతిస్తిమితం లేని ఓ వ్యక్తి బాలకృష్ణ దగ్గరకు వచ్చి హెచ్చరించడం ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
తారకరత్న అంత్యక్రియలు నిర్వహించడానికి ముందు ఫిలిం ఛాంబర్లో అతని పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అక్కడికి వచ్చిన అభిమానులు లైన్లో నిలబడి తారకరత్నను చివరిచూపు చూసుకుని వెళ్లారు. ఆ సమయంలో లైన్లో నిలబడి వచ్చిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చాడు. తారకరత్న భౌతిక కాయాన్ని చూసిన తర్వాత అతను నేరుగా బాలకృష్ణ దగ్గరకు వెళ్లాడు. చేయి చూపించుకుంటూ ఏదో హెచ్చరించాడు. బాలయ్య కూడా ఆ వ్యక్తి చెబుతున్న మాటలను శ్రద్ధగా వింటూ తల ఊపాడు. ఇంకా అతను ఏదో చెప్పబోతుంటే అక్కడికి వచ్చిన పోలీసులు మతిస్తిమితం లేని వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అసలు ఆ వ్యక్తి ఎవరు? బాలయ్యను ఏ విషయంలో హెచ్చరించాడని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
నందమూరి వంశంలో వరుస విషాదాలపైనే ఆ మతిస్తిమితం లేని వ్యక్తి హెచ్చరించి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఏదైనా ప్రమాదం జరగబోతుందని చెప్పి ఉంటారా అని కూడా అనుమానపడుతున్నారు. ఏదో పిచ్చోడు ఏదేదో వాగి ఉంటాడని అనుకోవచ్చు కదా అని అంటే.. మరి బాలయ్య అతని మాటలను ఎందుకు శ్రద్ధగా విన్నాడు? అతని మాటలకు ఎందుకు ఎదురుచెప్పలేదని అయోమయంలో పడేస్తున్నారు. మరి ఆ మతిస్తిమితం లేని వ్యక్తి నందమూరి ఫ్యామిలీని ఏం హెచ్చరించాడో మరి !
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?
NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్గా చనిపోతున్నారెందుకు?
Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి
Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం