K Viswanath | కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఆయన సతీమణి జయలక్ష్మీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 2న కె.విశ్వనాథ్ మరణించిన సంగతి తెలిసిందే. కళాతపస్వి మరణించిన నెలలోపే ఆయన అర్ధాంగి కూడా కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఈ నెల 2వ తేదీన వృద్ధాప్య సమస్యలతో కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సాయంత్రం పూట ఒక పాట రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. చలనం లేకుండా పడిపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన శంకరాభరణం సినిమా రిలీజైన రోజే మరణించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది జరిగిన నెలలోపే కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి మరణించడం ఇప్పుడు అందర్నీ కలచివేస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
K.Viswanath | చిరంజీవి, కమల్ హాసన్కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?
K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్
K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి
K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్లో కె.విశ్వనాథ్కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి
K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి
K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు