Samantha | నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా ఇబ్బందులు ఎదుర్కోంది. విడాకుల విషయంలో సమంతదే తప్పు అన్నట్లుగా చాలా ప్రచారం జరిగింది. ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి. వాటితో సామ్ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ తర్వాత కొద్దిరోజులకే మయోసైటిస్ అనే ఆటోఇమ్యూనిటీ డిజార్డర్ బారిన పడింది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత.. ఇప్పుడు మళ్లీ కెరీర్లో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఒకవైపు సిటాడెల్ వెబ్సిరీస్.. మరోవైపు ఖుషీ సినిమాపై ఫోకస్ చేసింది. వీటితో పాటు శాకుంతలం సినిమా ప్రమోషన్స్లోనూ పాల్గొంటోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత తనకు ఎదురైన అనుభవాలను తాజాగా బయటపెట్టింది.
ముఖ్యంగా విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే ఐటెం సాంగ్ చేయడంతో సమంత గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకున్నారు. వాటిపై తాజాగా సమంత రియాక్ట్ అయ్యింది. వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే పుష్ప సినిమాలో ఊ అంటావా మావ.. ఊఊ అంటావా అనే ఐటెం సాంగ్కు ఆఫర్ వచ్చింది. నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడుతూ ఇంట్లోనే కూర్చోవాలని అనిపించింది. అందుకే వెంటనే ఆ ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకున్నా. ఆ సాంగ్ అనౌన్స్ చేసినప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవాళ్లు అందరూ ఫోన్ చేసి వద్దని వారించారు. విడిపోయిన వెంటనే ఐటెం సాంగ్స్ చేయడం బాగోదు. ఇంట్లో కూర్చో చాలు అని సలహాలు ఇచ్చారు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే నా స్నేహితులు కూడా అలాగే చెప్పుకొచ్చారు. కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వివాహ బంధంలో నేను వంద శాతం నిజాయతీగా ఉన్నా. కాకపోతే అది వర్కవుట్ అవ్వలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలా ఎందుకు దాక్కోవాలి. చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధపడాలి? అని అనుకున్నా అని చెప్పుకొచ్చింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
World Idli Day | మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?
Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి