Oscars 2023 | తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా కలలు కన్న ఆస్కార్ అవార్డును సాకారం చేసుకొని దేశం మీసం మెలేశారు రాజమౌళి అండ్ టీం. దాంతో వాళ్లు ఇండియాకు ఎప్పుడెప్పుడు వస్తారా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో సన్మానం చేయాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆస్కార్ విజేతలకు భారీగానే నజరాణాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.
ఆస్కార్ తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి వీళ్లంతా ఇండియాకు వస్తారేమో అనుకున్నారు.. కానీ వెను వెంటనే ఒక్కొక్కరు ఇండియాకు పయనం అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయల్దేరి వచ్చేశారు. బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు తారక్కు సాదర స్వాగతం పలికారు. రెండు మూడు రోజుల రెస్ట్ తర్వాత కొరటాల సినిమాతో బిజీగా కానున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదే విషయం హాలీవుడ్ మీడియాతో కూడా చెప్పాడు తారక్. తన నెక్స్ట్ సినిమా షూటింగ్ మార్చ్ లోనే మొదలవుతుందని తెలిపాడు.
రామ్ చరణ్ మాత్రం మరో రెండు రోజులు అమెరికాలోనే ఉండబోతున్నాడు. మార్చి 16న ఇండియా రానున్నాడు. అయితే హైదరాబాద్ మాత్రం కాదు.. ఢిల్లీలోనే ఆగి అక్కడే ప్రధాని మోదీ సారథ్యంలో జరగనున్న ఇండియా కంక్లేవ్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నాడు మెగా వారసుడు. ఇక కీరవాణి, చంద్రబోస్ కూడా నేడు రేపో ఇండియాకు వచ్చేస్తున్నారు.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటికే రిటర్న్ అయిపోయాడని తెలుస్తోంది. రాజమౌళి మాత్రమే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇండియాకు రావాలని చూస్తున్నాడు. వచ్చిన వెంటనే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీ కానున్నాడు దర్శక ధీరుడు. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. 2024 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
TSPSC | టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు – Time2news.com