Aishwarya Rai bachchan | బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్కు నోటీసులు జారీ అయ్యాయి. భూమి పన్ను చెల్లించనందుకు నాసిక్ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐశ్వర్యరాయ్కి నాసిక్లోని అద్వాడిలో హెక్టార్ భూమి ఉంది. దీనికి సంబంధించి పన్ను బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.
ఐశ్వర్యరాయ్ హెక్టార్ భూమికి సంబంధించి రూ.21,960 పన్ను చెల్లించాల్సి ఉందని, ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. బకాయి మొత్తాన్ని పది రోజుల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐశ్వర్యరాయ్ లీగల్ వ్యవహారాలు చూసే సిబ్బంది పన్ను చెల్లిస్తామని గతంలో చెప్పారని, అయితే ఇప్పటివరకు పన్ను చెల్లించకపోవడంతో తాజాగా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా నాసిక్ మున్సిపల్ అధికారులు జనవరి 9 న జారీ చేసిన నోటీసులపై ఐశ్వర్యరాయ్ స్పందించారు. గడువు తేదీలోగా పన్ను చెల్లిస్తామని ప్రకటించారు. పన్ను బకాయి మొత్తాన్ని జనవరి 18న గురువారం చెల్లిస్తామని తెలిపారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..
Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం
honey rose | సీనియర్ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్ ఛాన్స్
Rashmi Gautam | కోడికి లేని బాధ నీకెందుకు.. నెటిజన్ కామెంట్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి
priyanka jawalkar | పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినా నటించను.. ప్రియాంక జవాల్కర్ సంచలన వ్యాఖ్యలు
Dil Raju Marriage | దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? ఏడాది వెంటపడి మరీ ప్రపోజ్ చేశాడా?