Sri Rama Navami | పండుగపూట విషాదం నెలకొంది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం చూసేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు అక్కడి బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 12 మంది భక్తులు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ అపశ్రుతి చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లోని పటేల్ నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు ఎక్కువ మంది రావడంతో ఆలయ ప్రాంగణం సరిపోలేదు. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు మెట్లబావిపై ఉన్న ఫ్లోరింగ్ మీద కూడా పలువురు భక్తులు కూర్చొన్నారు. బరువు అధికం కావడంతో ఫ్లోరింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు బావిలో పడిపోయారు. ఈ ఘటనలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కొంత మంది భక్తులు బయటకు వచ్చేశారు. బావి గోడను పట్టుకుని మరికొంతమంది బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.
కాగా, ప్రమాదం గురించి తెలియగానే ఆలయానికి పరుగున వచ్చిన పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో బావిలో పడ్డ భక్తులను బయటకు తీసుకొచ్చారు. అయితే 50 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోవడంతో పాటు ఒకరిపై మరొకరు పడటంతో 12 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని ఇండోర్ జిల్లా కలెక్టర్ ఇళయరాజా ధ్రువీకరించారు.
ఇండోర్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో 12 మంది భక్తులు మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఫోన్ చేసి పరిస్థితి గురించి ఆరా తీశారు.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు
Moto G13 | రూ.10వేలకే 50MP కెమెరా, డాల్బీ స్పీకర్లతో అదిరిపోయే స్మార్ట్ఫోన్
World Idli Day | మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?
Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి