India Vs Sri Lanka | ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్లో చివరగా ఐదేళ్ల క్రితం భారత్, ఆస్ట్రేలియాల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 373 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అర్థ శతకాలు చేయగా.. విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. 80 బంతుల్లోనే శతకం చేశాడు. మొత్తంగా వన్డేల్లో 45 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. మరో 5 సెంచరీలు చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును అధిగమించనున్నాడు.
భారత్ తుది జట్టు:
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయస్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
World Health Organization | ఆ రెండు దగ్గు మందులు వాడొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ఆదేశాలు
Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?