Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup | వరుసగా రెండో మ్యాచ్‌లో భారత్‌ విక్టరీ.. నెదర్లాండ్స్‌పై 56 పరుగుల...

T20 world cup | వరుసగా రెండో మ్యాచ్‌లో భారత్‌ విక్టరీ.. నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో విజయం

T20 world cup | టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం సాధించింది. ఇప్పుడు గ్రూప్‌ 2లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత టాపార్డర్‌ రాణించడంతో భారీ స్కోరు చేయగలిగింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు అర్ధ శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్‌గా బరిలో దిగిన కేఎల్‌ రాహుల్‌ 9 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. రోహిత్‌తో కలిసి రెండో వికెట్ కు 73 పరుగులు జోడించారు. రోహిత్‌ 53 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. కోహ్లీ, సూర్యకుమార్‌లు మూడో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Read more: T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

పాకిస్థాన్‌పై ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించిన కోహ్లీ.. వరుసగా రెండో అర్ధ శతకం నమోదు చేశాడు. 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. సూర్యకుమార్‌ 25 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Read More : T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

180 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులే చేయగలిగింది. భువనేశ్వర్‌, హర్షదీప్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు రెండేసి వికెట్ల చొప్పున తీసి నెదర్లాండ్స్‌ నడ్డి విరిచారు. దీంతో 56 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

పాక్ పై సంచలన విజయం..

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీ20 ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లోనే భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీ చెలరేగిపోవడంతో చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టీ20లో చివరి బంతికి భారత్‌ విజయం సాధించడం ఇది నాలుగో సారి. అంతకుముందు 2016లో ఆస్ట్రేలియాపై, 2018లో బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌పై చివరి బంతికి భారత్‌ విజయం సాధించింది.

తొలి ప్రపంచకప్ భారత్ దే..

2007: 1983లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. 2007లో తొలిసారి జరిగిన T20 ప్రపంచకప్‌లో భారత్‌ విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్‌పై ధోనీ సేన విజయం సాధించింది.

Follow Us : FacebookTwitter

Read more articles | Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News