ICC ODI Rankings | అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకులను ప్రకటించింది. నూతన సంవత్సర ప్రారంభాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించిన కోహ్లీకి ఈ ర్యాంకుల్లో ఆరో స్థానం దక్కింది. అంతకుముందు 8వ స్థానంలో ఉండగా.. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో 80 బంతుల్లోనే సెంచరీ చేయడంతో రెండు ర్యాంకులు ముందుకువెళ్లాడు. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సారి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. 715 రేటింగ్ పాయింట్లతో 8 స్థానంలో నిలిచాడు.
వన్డే ర్యాంకుల్లో మొదటి 10 స్థానాల్లో భారత బౌలర్లకు చోటు దక్కలేదు. మహ్మద్ సిరాజ్ మాత్రం 18వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఆ తరువాత బుమ్రా 19 వ ర్యాంకులో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆల్ రౌండర్ల ర్యాంకింగ్ లో మొదటి 20 స్థానాల్లో ఒక్క ఇండియన్ క్రికెటర్ కూడా లేరు. వన్డేల్లో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం 891 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ 20లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లు దక్కించుకున్న ఇండియన్ బ్యాటర్గా సూర్య నిలిచాడు. సూర్య 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా అంతర్జాతీయ స్థాయిల్లో 900 పాయింట్లు దాటలేదు. ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే 897 పాయింట్లతో ఉన్నాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు