BRS MLA Sayanna | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సాయన్న ( 72 ) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో కుటుంబసభ్యులు సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే సాయన్న తుదిశ్వాస విడిచారు. సాయన్న మృతదేహాన్ని అశోక్ నగర్లోని ఇంటికి తరలించారు.
సాయన్న ఇప్పటివరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి మూడు సార్లు, బీఆర్ఎస్ నుంచి ఒకసారి గెలుపొందారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగానూ సాయన్న పనిచేశారు. 1951 మార్చి 5న చిక్కడపల్లిలో సాయన్న జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం
Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు
Passport | పాస్పోర్టు అప్లై చేసే వాళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఐదు రోజుల్లోనే వెరిఫికేషన్ కంప్లీట్