PM Narendra Modi Mother Heeraben | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా ఈ ఏడాది జూన్లో 99వ పుట్టిన రోజు జరుపుకున్న హీరాబెన్ శతవసంతంలోకి అడుగుపెట్టారు.
తల్లి అనారోగ్యం గురైన నేపథ్యంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో నగరంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబం మంగళవారం కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రహ్లాద్, అతని మనుమడికి గాయాలయ్యాయి.
Read More Articles |
Cancer | భయపెడుతున్న ఊపిరితిత్తుల కేన్సర్లు .. ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం
Corona | చైనాలోని ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు.. చేతులెత్తేసిన అధికారులు
Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్ మీకోసమే..