Mumbai | ముంబైలో ఉగ్రదాడులు చేస్తామంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( NIA ) కు ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడినంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని నగరాలను అప్రమత్తం చేశారు.
అయితే ఎన్ఐఏకి వచ్చిన మెయిల్పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ముంబై పేలుళ్లకు పాల్పడతామంటూ గత ఏడాది అక్టోబర్లో బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. దర్యాప్తులో అది ఫేక్ కాల్ అని తేలింది. గత నెలలో ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
K. Vishwanath | కే. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళిసై, కేసీఆర్, జగన్ సంతాపం..