Liquor Policy | ఇకపై మధ్యప్రదేశ్లో బార్ షాప్లు, మద్యం దుకాణాల దగ్గర ఉండే పర్మిట్ రూంలు బంద్ కానున్నాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీనిప్రకారం బార్ షాప్లు, పర్మిట్ రూంలను శాశ్వతంగా మూసివేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు తెలిపారు. ఇకపై లిక్కర్ షాప్ల్లో మద్యం విక్రయాలు మాత్రమే జరుగుతాయని.. వాటి దగ్గర సిట్టింగ్ కోసం పర్మిట్ రూంలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలలు, బాలికల హాస్టళ్లు, మత స్థలాల నుంచి మద్యం షాపుల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతున్నామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసేందుకు చట్టాలను మరింత కఠినతరం చేస్తామని వెల్లడించారు.
“ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యపానాన్ని నిషేధించేందుకు కృషి చేస్తున్నారు కాబట్టి 2010 నుండి రాష్ట్రంలో కొత్త దుకాణం తెరవలేదు. దీనికి విరుద్ధంగా, దుకాణాలు మూసివేయబడ్డాయి” అని మిశ్రా చెప్పారు. నర్మదా సేవా యాత్ర సందర్భంగా రాష్ట్రంలో 64 దుకాణాలు మూతపడ్డాయని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్లో మద్యపానానికి వ్యతిరేకంగా ఉమా భారతి కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. ఉదారవాద ఎక్సైజ్ పాలన ద్వారా ప్రజల మద్యపాన అలవాటును క్యాష్ చేసుకోవద్దని మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే చౌహాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?
NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్గా చనిపోతున్నారెందుకు?
Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి
Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం