Corona Cases | దేశంలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. రెండు వారాల కిందటి వరకు స్తబ్దుగా ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 11వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాడు ఓ నివేదిక విడుదల చేసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,21,725 మందికి కరోనా టెస్టులు చేయగా 11,109 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. గురువారంతో పోలిస్తే ఈ పెరుగుదల 9 శాతం కంటే ఎక్కువ ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 29 మందికి కరోనా వైరస్ కారణంగా మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 50వేలకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 49,622 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,064కు చేరింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
GT vs PBKS | హర్దిక్ సేనకు మూడో విజయం.. పంజాబ్ కింగ్స్ను చిత్తుచేసిన గుజరాత్ టైటాన్స్
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు