Vizag | మూడు రాజధానులపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజులాంటి వాడు అని.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే రాజధాని అక్కడేనని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ నుంచే రాష్ట్ర భవిష్యత్తు మారుస్తామని పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు వైజాగ్కు అన్ని హంగులు ఉన్నాయని ఆయన తెలిపారు. రాజధానికి ఇక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుందని అన్నారు.
ఏపీ సీఎం జగన్ విశాఖకు వస్తారని.. ఇక్కడ నివాసం ఉంటారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. దానికి అందరం కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, వైజాగ్ను పరిపాలన రాజధానిగా ఉంటాయని వెల్లడించారు. వైజాగ్లో ఐటీ, పర్యాటక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర శాఖల భవనాలను అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటామని స్పష్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్లో నిలిచిన విశాఖపట్నం
YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ సీఎం జగన్
LPG Cylinder | గ్యాస్ సిలిండర్ డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? ఈ నంబర్కు కాల్ చేయండి