Padmasana | ఆరోగ్యంగా ఉండటంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న చిన్న ఆసనాలు వేసినా సరే గొప్ప గొప్ప ఫలితాలను పొందవచ్చు. అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. ఈ యోగాసనాల్లో ముందుగా పద్మాసనం ఎలా వేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పద్మాసనం ఎలా వేయాలి.
రెండు కాళ్లను ముందుకు చాపి దండాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత కుడికాలు పాదాన్ని పట్టుకుని ఎడమ తొడ మొదట్లో ఉంచాలి. అలాగే ఎడమ కాలి పాదాన్ని పట్టుకుని కుడి తొడ మొదట్లో ఉంచాలి. ఆ సమయంలో వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చాచి ఎడమ చేతిని ఎడమ మోకాలు వద్ద, కుడి చేతిని కుడి మోకాలు వద్ద ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలికి నడుమ ఆనించి మిగతా వేళ్లను ముందుకు చాపి ఉంచాలి. లేదంటే రెండు అరచేతులను ఒకదాన్ని ఒకటి పట్టుకుని రెండు పాదాల మధ్య ఉంచవచ్చు. ఆసనం వేస్తున్న సమయంలో మనసును ఏకాగ్రతలో ఉంచుకోవాలి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
Read More Articles |
Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?
Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి
Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం