Vasthu Tips | ఈశాన్యంలో బరువు పెట్టకూడదని తరచూ వింటూనే ఉంటారు. ఒక ఇంటికి వాస్తు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే మాట చెబుతుంటారు. ఇంతకీ ఈశాన్యం దిక్కున బరువులు ఎందుకు పెట్టకూడదు? పెడితే ఏమవుతుంది?
ఈశాన్యంలో సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడు. ఒకవేళ ఆ దిక్కున ఏవైనా వస్తువులు పెడితే అది మూసుకుపోతుంది. అప్పుడు ఈశ్వరుడి స్థానమైన ఈశాన్య దిక్కునకు వెళ్లడం కుదరదు. దీంతో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాగే ఈశాన్యం వస్తువులతో మూసివేసినట్టు ఉండటం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు కూడా సరిగ్గా రాదు. ఈ కారణంతోనే ఈశాన్య భాగంలో చెట్లను కూడా పెంచవద్దని చెబుతారు. అందుకే ఈశాన్యాన్ని ఖాళీగా ఉంచాలి.
ఈశాన్య భాగానికి దిక్పాలకుడు చాలా సున్నితత్వం కలవాడు. కాబట్టి ఆయన వైపు గరికపోచ బరువు కూడా ఉండొద్దని వాస్తు నిపుణులు చెబుతారు. ఒకవేళ ఈశాన్యంలో బరువు పెడితే.. మన జీవితంలో బరువులు పెరుగుతాయని అంటారు.
Read More Articles |
Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి
Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం