Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentNandamuri Tarakaratna | హీరోగా సక్సెస్ కాలేకపోయినా.. విలన్‌గా మారి నంది అవార్డు గెలుచుకున్న నందమూరి...

Nandamuri Tarakaratna | హీరోగా సక్సెస్ కాలేకపోయినా.. విలన్‌గా మారి నంది అవార్డు గెలుచుకున్న నందమూరి హీరో

Nandamuri Tarakaratna | నందమూరి వారసుడిగా తారకరత్న సినిమా ఎంట్రీ ఒక సంచలనం. ఇప్పటివరకు ఏ నటుడికి సాధ్యం కాని విధంగా ఒకటే రోజు 9 సినిమాకు సైన్‌ చేసి అప్పట్లో రికార్డు క్రియేట్‌ చేశాడు. కానీ ఆ హైప్‌ తర్వాత కంటిన్యూ కాలేదు. రూపంలో బాగానే ఉన్నా.. నటనలోనూ టాలెంట్‌ ఉన్నా నందమూరి వారసుడికి కలిసిరాలేదు. హీరోగా చాలా సినిమాలే చేసినా సక్సెస్‌ దక్కలేదు. దీంతో తన రూట్‌ మార్చి నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ ఒప్పుకుని.. తనలో నటుడిని అందరికీ పరిచయం చేశాడు.

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాతో తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించాడు. శీను అనే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఇరగదీశాడు. ఆ సినిమాలో తన నటనతో నందమూరి వారసుడు అంటే ఏంటో నిరూపించాడు. ఉత్తమ విలన్‌గా అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నారా రోహిత్‌ హీరోగా వచ్చిన రాజా చెయ్యి వేస్తే సినిమాలోనూ విలన్‌గా అద్భుతంగా నటించాడు. S5 సినిమాలోనూ విలన్‌గా మెప్పించాడు.

సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లో కూడా తారకరత్న చేశాడు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో 9 అవర్స్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్‌ అవుతున్నది. ఇక తారకరత్న నటించిన చివరి చిత్రం మిస్టర్‌ తారక్‌ ఫిబ్రవరి 24న విడుదల కానుంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News