Keerthy Suresh | ఐదేళ్ల కింద నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేశ్.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్స్ తో నటించిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఈమె కమర్షియల్ హీరోయిన్ కాలేకపోయింది. తమిళంలోనూ విజయ్ విక్రమ్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో కనిపించింది కీర్తి. పైగా నటిగా కూడా ఈమెకు తిరుగులేదు నటనలో ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు.. అవకాశాల విషయంలో మాత్రం కీర్తి సురేశ్ కి ఎప్పుడూ నిరాశ మాత్రమే ఎదురవుతుంది.
మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు ఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మునుపెన్నడూ లేని విధంగా మహేశ్ బాబు సినిమాలో రెచ్చిపోయింది కీర్తి సురేశ్. ఆ సినిమా తర్వాత కచ్చితంగా మిగిలిన హీరోలు కూడా పిలిచి అవకాశం ఇస్తారని ఆమె ఎన్నో కలలు కన్నది. కానీ అలాంటి విచిత్రాలు ఏవి జరగలేదు. ఎప్పటిలాగే మళ్ళీ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది కీర్తి సురేశ్.
ఇంత చేసిన.. ఎంత చూపించినా ఇప్పటికీ ఈమెలో కమర్షియల్ కోణం చూడలేకపోతున్నారు దర్శకులు.
మహానటి సినిమా చేసిన తర్వాత కీర్తిని కేవలం లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ లో మాత్రమే ఊహించుకుంటున్నారు. దాంతో తెలుగు ఇండస్ట్రీపై కాస్త కినుక వహించింది కీర్తి సురేశ్. మళ్లీ తనకు కలిసి వచ్చిన ఫిమేల్ సెంట్రిక్ స్క్రిప్టుల వైపు అడుగులు వేస్తుంది. ఈ మధ్య హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో రఘు తాత అనే సినిమాకు కమిట్ అయింది. అలాగే తమిళంలో రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. మహానటి కీర్తి సురేశ్ కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో.. అంత మైనస్ కూడా అయింది. ఆ సినిమా తర్వాత ఆమెను గ్లామర్ కోణంలో చూడలేకపోతున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలో అందాలు ఆరబోస్తే తప్ప అవకాశాలు రావు. అందుకే కీర్తి సురేశ్ ఇప్పటికి స్టార్స్ దృష్టిలో పడలేకపోతుంది.
Read More Articles |
Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్ అంత ఎమోషన్గా సాగిందా?
Haripriya Engagement | కేజీఎఫ్ విలన్తో ఘనంగా హీరోయిన్ ఎంగేజ్మెంట్