Adipurush | జై శ్రీరాం అని ఎక్కడ వినబడ్డా.. రామ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడికి హనుమంతుడు వస్తాడు.. ఆయన కోసం థియేటర్లో ఒక సీటు విడిచిపెట్టాలని ఇటీవల ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ సూచించాడు. ఆయన చెప్పిన మాటలను రామభక్తులు తూచా తప్పకుండా పాటించారు. ప్రతి సినిమా హాల్లో ఒక సీటు ఆయనకు విడిచిపెట్టి.. దానికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే దీన్ని కొంతమంది నాస్తికులు ఎగతాళి కూడా చేశారు. హనుమంతుడు ఏంటి? సినిమా చూడటమేంటి? అంటూ నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ప్రదర్శిస్తున్న సినిమాకు నిజంగానే అంజనీపుత్రుడు వచ్చేశాడు.
ఆదిపురుష్ సినిమా ఇవాళ విడుదలై బ్లాక్బస్టర్ టాక్తో దూసుకెళ్తోంది. రామకథను చూస్తూ ప్రేక్షకులు తన్మయత్వంతో పులకించిపోతున్నారు. అలా సినిమా ప్రదర్శించబడుతున్న సమయంలో ఓ కోతి థియేటర్లోకి వచ్చేసింది. అది చూసిన ప్రేక్షకులు హనుమంతుడే వానర రూపంలో వచ్చాడని ఫిక్సయిపోయారు. ఇంకేముంది ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రామనామ పారాయణంతో థియేటర్ అంతా మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పలువురు నెటిజన్లు.. హనుమంతుడే వచ్చి సినిమా చూశాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. ఇందులో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటించారు. ఇక లంకాధిపతి లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరిస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తోంది.
Read More Articles |
Kajal Aggarwal | మళ్లీ తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్
Adipurush | ఆలయాలుగా మారిన ఆదిపురుష్ థియేటర్లు.. హనుమంతుడి సీటు ఎలా ఉందో చూశారా?