Alia Bhatt | బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆలియా ఇంట్లో కూర్చొని ఉన్న సమయంలో పక్కింటి బిల్డింగ్ ఎక్కిన ఇద్దరు దుండగులు ఆమె ఫొటోలను దొంగచాటుగా తీశారు. ఇది గమనించి ఆలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడం పట్ల ఆలియా చాలా సీరియస్ అయ్యింది. తన ఆగ్రహాన్ని మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లగక్కింది.
నేను మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కూర్చొని ఉన్నా. ఆ సమయంలో నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపించింది. వెంతటనే బయటకు చూశా. అప్పుడే మా పక్కింటి టెర్రస్ మీద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. చేతిలో కెమెరాలు పట్టుకుని మా ఇంట్లోకే చూస్తున్నారు. అది చూసి షాకయ్యా. ఇది నా ప్రైవసీని దెబ్బతీయడమే అవుతుంది. ఎలాంటి వారి మధ్య అయినా దాటకూడని చిన్న లైన్ ఉంటుంది. ఇవాళ ఆ లిమిట్ క్రాస్ చేసి మా ఇంట్లోకి కెమెరాలు పెట్టారు. ఇతరుల పర్సనల్ విషయాల్లో గోప్యం పాటించరా? ఇక చాలు అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆలియాభట్ సీరియస్గా రాసుకొచ్చింది. దాన్ని ముంబై పోలీసులకు ట్యాగ్ చేసింది. తన కూతురు రాహా కపూర్ ఫోటోల కోసమే సదరు కెమెరామెన్ హద్దులు మీరి ప్రవర్తించినట్లు వెల్లడించింది. ఇది తన ప్రైవసీకి పూర్తిగా భంగం కలిగించడమే అని ఆలియాభట్ పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను విజ్ఞప్తి చేసింది.
రణబీర్ కపూర్- ఆలియా భట్ గతేడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అయిన నెలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించి ఆలియా షాక్ ఇచ్చింది. ఇక గతేడాది చివర్లో అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు రాహా కపూర్ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. పాపతో ఆలియా బయటకు కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే పాప ఫోటోలను ఎలాగైనా సంపాదించాలని కొందరు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించారు. ఆలియా అపార్ట్ మెంట్ కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ మీద నుంచి ఆమె ఇంటి వైపు కెమెరాలు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన ఆలియా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ముంబైలో సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు సైతం విచారణ జరుపుతున్నారు. దీనిపై బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు. తాము సెలబ్రెటీలు మాత్రమే కావచ్చు.. కానీ మాకూ పర్సనల్ లైఫ్ ఉంటుంది. అందులోకి తొంగిచూడటం ఎంతవరకు అని ప్రశిస్తున్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
.
ఇలాంటి ఘటనే గతంలో విరుష్క దంపతులకు కూడా ఎదురైంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముద్దుల కూతురు వామిక ఫోటోలను తీయడం కోసం కొంతమంది ఫోటో గ్రాఫర్లు వాళ్ల ఇంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అనుష్క శర్మ సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇదే విషయాన్ని తాజాగా అనుష్క శర్మ మళ్లీ గుర్తు చేసింది. ఆలియాభట్ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ.. ఇది చాలా సిగ్గు చేటు అని వ్యాఖ్యానించింది. తమ కూతురు వామిక విషయంలో ఇలాంటి సంఘటనే ఎదుర్కొన్నామని గుర్తు చేసింది. కాగా..ఇది చాలా దారుణమైన చర్య అని.. ఇలాంటి సంఘటనలు తనకు చాలా సార్లు ఎదురయ్యాయని జాన్వీకపూర్ వెల్లడించింది. ప్రైవేటు స్థలాల్లో ఉన్నప్పుడు తన ఫొటోలు చాలా సార్లు తీశారని చెప్పింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!
Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!
Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?
NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్గా చనిపోతున్నారెందుకు?