Breaking News | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్ – షిర్డీ హైవేపే సిన్నార్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిన్నార్లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఓ టూరిస్ట్ కంపెనీకి చెందిన బస్సు థానే జిల్లాలోని అంబరీనాథ్ నుంచి షిర్డీ బయల్దేరింది. వావి పోలీస్ స్టేషన్ సమీపంలోకి వచ్చిన తర్వాత ట్రక్కు, ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో పల్టీలు కొట్టి బస్సు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ఈ యాక్సిడెంట్కు కారణమని తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Hyper Aadi | పవన్ కళ్యాణ్కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్ ఆది సెటైర్లు