Pavala Shyamala | పావల శ్యామల గుర్తుందా.. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో నవ్వించిన ఈ సీనియర్ నటి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. వృద్ధాప్యం కారణంగా చాలా ఇంట్లోనే ఉండిపోయింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామల ఒక వృద్ధాశ్రమంలో కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన బాధనంతా చెప్పుకొచ్చింది. ఒక్కసారి చిరంజీవి ( Chiranjeevi )ని కలుసుకోవాలని ఉందని తెలిపింది.
తాను ఇబ్బందుల్లో ఉంటే పలువురు స్టార్ హీరోలు తనకు సాయం చేశారని ఇటీవల సోషల్మీడియాలో వచ్చిన వార్తలపై పావలా శ్యామల స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి తప్ప ఎవరూ తనకు సాయం చేసింది లేదని తెలిపింది. చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని.. టాప్ పొజిషన్లో ఉన్నప్పటికీ పని పట్ల అంకితభావం చూపిస్తున్నారని ప్రశంసించింది. కరోనా సమయంలో చిరంజీవి ఎంతోమందికి సాయం అందించారని.. తను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తెలుసుకుని రూ.2 లక్షలు పంపించి ఆదుకున్నారని వెల్లడించింది. నటీనటులకు ఎలాంటి అన్యాయం జరిగినా మెగాస్టార్ చిరంజీవి ముందుండి మాట్లాడతారని తెలిపింది. ఆయన్ను ఒకసారి కలిసి తనకు జరిగిన అవమానం గురించి ఆయనతో చెప్పాలని ఉందని ఎమోషన్ అయ్యింది. తనకు జరిగిన అవమానం గురించి తెలిస్తే చిరంజీవి సహించలేరని పేర్కొంది. అయితే తనకు జరిగిన అవమానం ఏంటనేది మాత్రం పావలా శ్యామల వెల్లడించలేదు