Sushant singh rajput | సముద్రంలో కెరటంలా ఒక్కసారిగా బాలీవుడ్లోకి దూసుకొచ్చాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఎంత స్పీడ్గా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడో.. అంతే స్పీడ్గా డౌన్ అయ్యాడు. చివరకు తన కెరీర్లో వైఫల్యాలను తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఎవరూ లేని సమయంలో తన ప్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ బలవన్మరణానికి పాల్పడి రెండేళ్లు అయిపోయినప్పటికీ ఈ ఉదంతాన్ని బాలీవుడ్ మరిచిపోలేకపోతోంది. సుశాంత్ మరణానికి బాలీవుడ్లో ఉన్న నెపోటిజమే కారణమని ఇప్పటికీ చాలామంది గళమెత్తుతూనే ఉన్నారు. హీరోనే కాదు ఒక మంచి మనిషి దూరమయ్యాడని సుశాంత్ను గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ బాధపడేవాళ్లు ఉన్నారు. ఇలా బాధపడేవాళ్ల విషయం పక్కనబెడితే.. సుశాంత్ మరణించిన ప్లాట్ అంటేనే ఇప్పుడు జనాలు భయపడిపోతున్నారు. ఈ విషయం ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది.
ముంబైలోని బీచ్ వ్యూతో ఉన్న ఓ లగ్జరీ ఫ్లాట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉండేవాడు. అదే ఫ్లాట్లో 2020 జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్నుంచి ఆ ఫ్లాట్ను చూస్తేనే అమ్మో అంటున్నారు జనాలు. దీంతో సుశాంత్ మరణించి రెండున్నరేళ్లు దాటినా కూడా ఆ ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగాలంటే భయపడిపోతున్నారు. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ రషీద్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంతకుముందు ఈ ఫ్లాట్ను చూసేందుకు కూడా ఎవరూ ఇష్టపడేవారు కాదని.. ఇప్పుడు కాస్త నయమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీని అద్దె నెలకు రూ.5లక్షలు అని తెలిపాడు. ఈ ఫ్లాట్ ఒక ఎన్ఆర్ఐది అని.. అతను అద్దె తగ్గించడానికి ఒప్పుకోవడం లేదని చెప్పాడు. సుశాంత్ మరణం తర్వాత ఇంటిని సినీ ప్రముఖులకు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నాడని కూడా తెలిపాడు. రియల్ఎస్టేట్ బ్రోకర్ పెట్టిన ఈ పోస్టుతో మళ్లీ సుశాంత్ విషయం బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది.
Read More Articles |
Sukrithi Ambati | ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కిన కేరింత భావన.. ఫొటోలు వైరల్
Prabhas Shirt | బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి