TTD EO | తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. నెల రోజుల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ విషయంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను ఈవో ధర్మారెడ్డి అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈవో అమలు చేయకపోవడంతో ముగ్గురు ఉద్యోగులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఈవోపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తమ ఆదేశాలను భేఖాతర్ చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈవో ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
Read More Articles |
Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి
Varahi Registration | పవన్ కళ్యాణ్ వారాహి వివాదానికి ఫుల్ స్టాప్.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ కంప్లీట్
ఇంటి దీపాలను ఆర్పేసిన మరుగుదొడ్డి గుంట.. నీళ్లల్లో పడి అన్నాచెల్లెళ్లు మృతి