Theri Remake | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star Pawan kalyan ), డైరెక్టర్ హరీశ్ శంకర్ ( Harish shankar ) కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ( Gabbar singh ) చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో పవన్ మేనరిజం చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. రాసుకోరా సాంబ అంటూ పవన్ కళ్యాణ్ పండించిన కామెడీ, హీరోయిజానికి అభిమానులు ఫిదా అయిపోయారు. అప్పట్నుంచి పవన్, హరీశ్ కాంబినేషన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ అది కుదరడం లేదు. అప్పట్లో భవదీయుడు భగత్ సింగ్ వస్తుందంటూ ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. పవన్ వేరే ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో వీరి కాంబినేషన్కు బ్రేక్ పడింది. దీంతో ఆ సినిమా కోసం హరీశ్ శంకర్ మరో హీరోను వెతుకుతున్నాడని వార్తలు వచ్చాయి. ఇది పక్కన పెడితే హరీశ్ శంకర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. తన తదుపరి చిత్రం పవర్స్టార్తో ఉంటుందని అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్ను భయపెడుతోంది.
పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎందుకు భయపడుతున్నారనే కదా సందేహం. అదేమీ లేదు.. అప్పట్లో విజయ్ హీరోగా వచ్చిన థెరీ సినిమా గుర్తుంది కదా.. ఇందులో సమంత హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తెలుగులో పోలీసోడుగా రీమేక్ కూడా అయ్యింది. ఇప్పుడు ఈ సినిమానే హరీశ్ శంకర్ రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో థేరీ రీమేక్ మాకు అవసరం లేదంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ఒక అభిమాని అయితే ఈ సినిమా రీమేక్ చేస్తే సూసైడ్ చేసుకుంటానని లెటర్ కూడా రాశాడు. మరి అభిమానులు ఇంతగా వద్దని అంటున్న సినిమాతోనే పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ వస్తారా? లేదా కొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తారా అనేది చూడాలి.