Sukhvinder Singh Sukhu | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన సుఖ్వీందర్ సింగ్ సుఖు బీజేపీని టార్గెట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ కమలం పార్టీ హిందుత్వ అజెండా అస్సలే పనిచేయలేదని అన్నారు.
తొలి కేబినెట్ సమావేశంలోనే పాత పెన్షన్ విధానాన్ని ( OPS ) పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా సుఖ్విందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను ఏరివేస్తామని చెప్పారు. అదే తమ తొలి ప్రాధాన్యత అని హెచ్చరించారు. తన విజయంలో తన తల్లి కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజస్థాన్ సీఎం, చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరయ్యారు.
Read More Articles |
India record victory | టీమిండియా రికార్డు విక్టరీ.. బంగ్లాదేశ్ పై 227 పరుగుల తేడాతో విజయం
Ishan Kishan | ఇసాన్ కిషన్ రికార్డు డబుల్ సెంచరీ
Farmers | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్లో కేంద్రం ప్రకటన