TRC MLC Kalvakuntla Kavitha Warning to Nizamabad MP Dharmapuri Arvind | నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని హెచ్చరించారు. చూస్తూ ఊరుకుంటే తమాషాలు అవుతున్నాయా అని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాజకీయాలు చేయ్ తప్ప పిచ్చి వేషాలు వేయకంటూ హితవుపలికారు. నీ ప్రవర్తన ఇలాగే ఉంటే ఏ నియోజకవర్గంలోకి వెళ్లి పోటీ చేసినా సరే.. వెంటపడి మరీ ఓడిస్తానని హెచ్చరించారు.
నిజామాబాద్ రైతుల కాళ్లు మొక్కాలి
ఒక ఎంపీగా అర్వింద్ నిజామాబాద్కు చేసింది ఏమీ లేదని.. ఆయన పర్ఫార్మెన్స్ సున్నా అని కవిత అన్నారు. గెలిస్తే సమస్యలను పరిష్కరిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. పసుపు బోర్డుపై ఒక్కసారి కూడా ఆయన పార్లమెంటులో నోరు మెదపలేదని పేర్కొన్నారు. పసుపు బోర్డు తేలేని అర్వింద్ రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని అన్నారు.
కొట్టి కొట్టి చంపుతాం
తాను పార్టీ మారుతుందని చేస్తున్న ప్రచారం మీద కూడా ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఖర్గేతో ఫోన్ మాట్లాడనని అంటున్నరు కదా నిరూపించాలని అన్నారు. రాజకీయాల్లో పొలైట్గా ఉండేవాళ్లతో అందరూ మాట్లాడతరని చెప్పారు. నీలాంటి పిచ్చోళ్లతో ఎవరూ మాట్లాడరు.. మంచిగా ఉండే వాళ్లతోనే అందరితో మాట్లాడతారంటూ మండిపడ్డారు. ఇంకోసారి లైన్ దాటితో ఊరుకోమని.. కొట్టి కొట్టి చంపుతామని హెచ్చరించారు. 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రశాంతంగా ఉన్న నాతో ఇన్ని మాటలు అంటున్నా అంటే వాడు ఎంత చీఫ్ ఫెల్లోనో అర్థమవుతోందని పేర్కొన్నారు.