Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsInternationalTwitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Twitter | ఢిల్లీ, టైమ్‌2న్యూస్‌ : ట్విట్టర్‌ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా భారత్‌లోని తమ రెండు కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని నగరం ఢిల్లీ, ముంబైల్లో ఉన్న ఆఫీసులను మూసివేస్తున్నట్లు తెలిపారు. అందులో పని చేసే సిబ్బంది ఇక మీదట ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఈ సంస్థల్లో ఉన్నందున ఖర్చులను తగ్గించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ వివరించారు.

బెంగళూరులోని కార్యాలయం మాత్రం యథావిథిగా కొనసాగుతుందని తెలిపారు. ఇక్కడి ఆఫీసులోని ఇంజనీర్లలో చాలామంది నేరుగా అమెరికాలోని కార్యాలయంతోనే కాంటాక్ట్ కలిగి ఉంటారని, ఇండియన్ సిబ్బందిలో భాగం కారని స్పష్టమవుతోంది. గత ఏడాది చివరి నెలల్లో ఇండియాలో సుమారు 90 శాతం పైగా ..అంటే దాదాపు 200 మంది ఉద్యోగులను మస్క్ తొలగించారు. ఆర్ధిక కష్టాల బారి నుంచి కొంతవరకైనా గట్టెక్కేందుకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన చెప్పారు. కానీ ఇండియాను మాత్రం ‘కీ గ్రోత్ మార్కెట్’ గా మస్క్ భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తాజా చర్యను విశ్లేషిస్తే. ప్రస్తుతానికి మార్కెట్ కు ఆయన తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనబడుతోందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.

44 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి వరుసగా కష్టాల బారిన పడుతూనే ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రధాన కార్యాలయంతో పాటు లండన్ కార్యాలయాల అద్దె చెల్లించలేక మస్క్ సతమతమయ్యారు. తమ చెల్లింపులు జరగకపోవడంతో పలు సంస్థలు ఆయనపై కోర్టుల్లో దావాలు వేశాయి. చివరకు తన కార్యాలయంలోని అనేక వస్తువులను ఆయన వేలం ద్వారా అమ్ముకోవాల్సి వచ్చింది.

450 మందిని తొలగించిన గూగుల్‌

ట్విట్టర్‌ నుంచి మొదలైన లేఆఫ్స్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇతర దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఆయా సంస్ధలకు నష్టాలు కలగలిపి.. లాభాలు పెద్దగా రావడం లేదని ఉద్యోగులను సాఫ్ట్వేర్, ఐటీ దిగ్గజాలు తొలగిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గతంలోనే తెలిపింది. ఈ క్రమంలో తొలిదశ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. భారత్ లో ఉన్న గూగుల్ కార్యాలయాల నుంచి సుమారు 450 మందిని తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ లలో ఉన్న కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై లేఆఫ్ ప్రభావం పడింది. గూగుల్ నుంచి బయటకు వచ్చేశామంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

“గూగుల్ ఇండియా ఇటీవలి తొలగింపుల్లో ఎంతో నైపుణ్యాలు, ప్రతిభ ఉన్న సహోద్యోగులు కొందరు ప్రభావితమైనట్టు శుక్రవారం ఉదయమే సమాచారం అందింది” అంటూ గూగుల్ ఇండియా ఉద్యోగి రజనీష్ కుమార్ షేర్ చేశారు. గూగుల్ ఇండియా గురువారం తొలగించిన వారిలో తాను కూడా ఉన్నానని అకౌంట్ మేనేజర్ కమల్ దవే కూడా తెలిపారు. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ఉద్యోగులను అధికంగా పనుల్లోకి తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే ఇప్పుడు కొందరిని తొలగిస్తున్నట్టు గూగుల్ వివరణ ఇచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News