Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentRajamouli | కొంచెం గ్యాప్‌ ఇవ్వండి.. అని రాజమౌళి ఎందుకు అన్నారంటే..!

Rajamouli | కొంచెం గ్యాప్‌ ఇవ్వండి.. అని రాజమౌళి ఎందుకు అన్నారంటే..!

Rajamouli | తెలుగు చలన చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజమౌళిది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఆస్కార్‌ లో కూడా నామినేట్ అయ్యింది. ఈ చిత్రంలోని నాటునాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు కూడా వచ్చింది. తాజాగా భారత కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే పద్మ అవార్డులను ప్రకటించింది.
అందులో మరకత మణి కీరవాణీకి పద్మశ్రీ దక్కింది.

గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన మ్యూజిక్‌ తో మైమరిపింప జేస్తున్న కీరవాణి ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తన పెద్దన్నయ్యకు ఈ అవార్డు వచ్చిందని తెలిసి రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

”నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని… నేను మీ అభిమానుల లాగే అనుకుంటున్నాను. అయితే మీరే చెప్పారు ఒకసారి.. ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ విశ్వం ఊహించని రీతిలో ఇస్తుందని.. ఇక నేనే గనుక ఈ విశ్వంతో మాట్లాడితే… అవార్డుకు అవార్డుకు కొంచెం గ్యాప్‌ ఇవ్వమని చెబుతాను.. ఎందుకంటే ఒకటి పూర్తిగా ఎంజాయ్‌ చేశాకు ఇంకోటి ఇవ్వు” అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు.

రాజమౌళి చేసిన ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పద్మశ్రీ రావడంతో రాజమౌళి ఉబ్బితబ్బిబవుతున్నారు. మరోపక్క కీరవాణి కూడా తన తల్లిదండ్రులకు, గురువులకు సదా రుణపడి ఉంటాను అని సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News