Apple Phones Production | అమెరికా, బీజింగ్ మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్న వేళ తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ అప్రమత్తమైందా? చైనాలోని కంపెనీలను తరలించాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
కర్ణాటకలోకి ఫాక్స్కాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కథనంలో పేర్కొంది. దాదాపు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడితో యాపిల్ ఫోన్ల తయారీ ప్లాంటును నెలకొల్పనుందని తెలిపింది. వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉత్పత్తి కార్యకలాపాలను చైనా నుంచి తరలించాలని సంస్థ భావిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్సు ఉంది.
ఈ మేరకు కర్ణాటకలో ఫాక్స్కాన్ ప్లాంట్ ఏర్పాటు గురించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్టుకు సమీపంలోనే 300 ఎకరాల్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ ఆధ్వర్యంలోని బృందం కర్ణాటక ఐటీ మంత్రిని కలిసి .. స్థలాన్ని కూడా పరిశీలించిందని సమాచారం. బెంగళూరులో ఏర్పాటు చేసే ప్లాంట్లో ఐఫోన్ల తయారీతో పాటు అసెంబుల్ చేయనున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది.
అయితే అంతకుముందు తెలంగాణలో పర్యటించిన ఫాక్స్కాన్ చైర్మన్.. తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్తోనూ భేటీ అయింది. భారీగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. దీని ద్వారా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారమో.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Emoji | ఎమోజీల ట్రెండ్ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?
First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా