India Vs Srilanka | భారత్తో జరగుతున్న రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత ఓపెనర్లు తడబడ్డారు. భారత ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ రెండో ఓవర్లోనే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాతి ఓవర్లోనే త్రిపాఠి ఔటయ్యాడు. కష్టాల్లో ఆదుకుంటాడనుకున్న పాండ్యా కూడా 12 పరుగులకే ఔటయ్యాడు. దీపక్ హుడా కూడా మరోసారి నిరాశపరిచాడు. దీంతో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ వరుస సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయారు. అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినా చివర్లో వికెట్లు పడిపోయాయి. శనక అద్భుతమైన బౌలింగ్తో భారత ఆశలను అడియాశలు చేశాడు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో 51 పరుగులు చేశాడు. అయితే 16 వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఔటవడంతో శివమ్ మావి క్రీజులోకి వచ్చాడు. 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్లతో చెలరేగిపోయాడు . చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో శనక అద్భుతమైన బౌలింగ్తో అక్షర్ పటేల్, శివమ్ మావిని ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 16 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని సిరీస్ను సమం చేసింది.
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ 31 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు. చరిత్ అసలంక 19 బంతుల్లో 4 సిక్సులు బాదాడు. 37 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్కు వచ్చిన డాసున్ శనక 22 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిపోయాడు. 2 ఫోర్లు, 6 సిక్సులు బాదడంతో శ్రీలంక భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, చాహల్ ఒక వికెట్ తీశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read more Articles:
India vs Srilanka | తొలి టీ20లో శ్రీలంకపై భారత్ విజయం.. ఆరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన శివమ్ మావి
Team India Schedule | కొత్త ఏడాది అయినా టీమిండియాకు కలిసొచ్చేనా? 2023 షెడ్యూల్ ఇదే