IND vs NZ | న్యూజిలాండ్తో జరిగిన కీలక టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 168 పరుగుల తేడాతో కివీస్ను చిత్తుగా ఓడించింది. మూడు టీ20ల సిరీస్ను కైవసం చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా దూకుడు ప్రదర్శించింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్ల్లో విఫలమైన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ చెలరేగి ఆడాడు. ఒక్కడే 126 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ (1) ఔటయినప్పటికీ.. రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి భారీ స్కోర్ దిశగా నడిపించారు. రాహుల్ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (24), హార్దిక్ పాండ్యా (30) కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి టీమిండియా 234 పరుగులు చేసింది.
235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మధ్యలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి 12.1 ఓవర్లకే కివీస్ కుప్పకూలింది. 66 పరుగులకే ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు, హర్ష్దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్ల చొప్పున తీశారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో దక్కించుకుంది.