Siricilla kidnap | ఆదిభట్లలో ఇటీవల డెంటల్ డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన ఘటన మరువకముందే అదే తరహాలో సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేశారు. యువతి తప్పించుకునే ప్రయత్నం చేసినా విడిచిపెట్టలేదు. అడ్డుకోబోయిన తండ్రిని నెట్టేసి వేగంగా కారును ముందుకు పోనిచ్చారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాగా, కిడ్నాప్ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన యువకుడిపై శాలిని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి చంద్రయ్యతో కలిసి ఉదయం 5 గంటల సమయంలో యువతి హనుమాన్ ఆలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా కిడ్నాప్ చేశారు. యువతి వచ్చే దారిలో అప్పటికే కారులో వేచి చూస్తున్న యువకులు ఆమె కనిపించగానే తండ్రిని నెట్టేసి కారులో బలవంతంగా తీసుకెళ్లారు. యువతి తప్పించుకునే ప్రయత్నం చేసినా వదిలిపెట్టలేదు. ఓ యువకుడు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో మరో ఇద్దరు యువతి తండ్రిని పట్టుకున్నారు. యువతిని కారులో ఎక్కించాక అందరూ కలిసి పరారయ్యారు.
ప్రేమ వ్యవహారమేనా..
కిడ్నాప్కు గురైన యువతికి, అదే గ్రామానికి చెందిన కట్కూరి జాన్ అనే యువకుడికి గత కొంత కాలంగా పరిచయం ఉంది. ప్రేమ పేరుతో గతంలో వేధించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆ యువతిని బయటకు తీసుకెళ్లి, జాన్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సమయానికి ఆమె మైనర్ కావడంతో పోలీసులు జాన్ పై ఫోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో జానే కిడ్నాప్ చేసి ఉండొచ్చని గ్రామస్తులు, కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
Read More Articles |
Bigg Boss season 7 | బిగ్బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?
ousehold tips | యాపిల్ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?