Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముస్లింలు అందరూ టెర్రరిస్టులే అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నోరు కరుచుకున్న రాందేవ్ బాబా.. ఈ సారి కార్పొరేట్ కంపెనీల అధినేతలపై పడ్డాడు. అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి దిగ్గజాల కంటే కూడా తమ సమయానికే విలువ ఎక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోవాలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన రాందేవ్ బాబా.. మూడు రోజుల ఈవెంట్ కోసం హరిద్వార్ వదిలి రావాల్సి వచ్చిందని తెలియజేశారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లా కంటే తన సమయం విలువైందని చెప్పారు. వాళ్లు 99 శాతం సమయాన్ని తమ పనుల కోసమే వెచ్చిస్తారు. ఒక యోగి మాత్రమే లోక కల్యాణం కోసం తన సమయాన్ని ఖర్చు చేస్తాడని చెప్పారు. అలా చూస్తే కార్పొరేట్ దిగ్గజాల కంటే ఒక యోగి అయిన తన సమయమే విలువైందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణపై బాబా రాందేవ్ ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు నిధుల్లేక నీరసించి ఖాయిలా పడే స్థితికి చేరుకున్న పతంజలి కంపెనీని.. బాలకృష్ణ తన టాలెంట్తో లాభాల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. 40వేల కోట్ల టర్నోవర్ గల సంస్థగా మార్చారని అన్నారు. ఈ సందర్బంగా ఆచార్య బాలకృష్ణను గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ఘనంగా సన్మానించారు. దేశంలో పతంజలి ఆయుర్వేదానికి గల ప్రాశస్త్యాన్ని వారు వివరించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?
NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్గా చనిపోతున్నారెందుకు?
Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి
Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం