Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శనివారం ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చాయి. గడ్కరీని చంపేస్తామంటూ మహారాష్ట్రలోని నాగ్పూర్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఉదయం 11.25, 11 గంటల 32 నిమిషాలకు, 12.30కు వరుసగా మూడుసార్లు ఫోన్ చేసి బెదిరించినట్లు నాగ్పూర్ పోలీసులు వెల్లడించారు.
గంట వ్యవధిలో మూడు సార్లు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గడ్కరీ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఇది ఆకతాయిల పనా.. సీరియస్ వార్నింగా అనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గడ్కరీ నివాసంతో పాటు ఆయన ఇంటివద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
COVID in China | చైనాలో 90 కోట్ల మందికి సోకిన కరోనా.. ఇంకో రెండు నెలల్లో మరింత విజృంభించే ఛాన్స్
Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమెపైనే శంకర్ ఆరోపణలు!
Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి
Kerala Schools | ఇక స్కూళ్లలో సర్… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్.. ఆదేశాలు జారీ !