Amit Shah | తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్లమెంట్ యోజనలో భాగంగా వికారాబాద్ జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి సర్కార్ నడుస్తోందని.. అధికారంలోకి రాగానే దొంగలను జైలులో పెడతామని తెలిపారు.
అసదుద్దీన్ ఒవైసీ ఎజెండా మీదనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని.. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. మజ్లిస్ పార్టీ అంటే తమకు భయం లేదని తెలిపారు. కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏం చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయానికి చేవెళ్లలో జరుగుతున్న ఈ సభ నిదర్శనమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ను చూసి బీజేపీ కార్యకర్తలు భయపడరని.. ఆయన్ను గద్దె దించేవరకు నిద్రపోరని అమిత్ షా అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కూడా అమిత్ షా చేవెళ్ల సభలో మాట్లాడారు. యువతీయువకుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని.. 35 లక్షల మంది నిరుద్యోగులను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆరోపించారు. పేపర్ లీకేజీపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడిన బండి సంజయ్ను జైల్లో పెట్టారు.. కానీ ఏమైంది 24 గంటల్లోనే బండి సంజయ్ బయటకు వచ్చారని తెలిపారు. ఈ లీకేజీల ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Follow Us : Google News and Facebook, Twitter
Read More Articles:
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!