TSRTC Special Offer | అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం స్పెషల్ బస్సులను కేటాయించింది. ఈ స్పెషల్ బస్సుల సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఒక ప్రకటనలో తెలిపారు.అయ్యప్ప భక్తులు ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. శబరిమల యాత్ర బస్సులపై ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేశామని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు.
శబరిమల యాత్ర బస్సు బుక్ చేసుకునే అయ్యప్ప భక్తులకు పలు రాయితీలు కూడా అందించనున్నట్టు ఆర్టీసీ చైర్మన్ తెలిపారు. శబరిమలకు బుక్ చేసుకున్న ప్రతి బస్సులో ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట మనుషులకు, 12 ఏళ్లలోపు మణికంఠ స్వాములకు, ఒక అంటెండర్కు ఉచిత ప్రయాణం అందించనున్నట్టు చెప్పారు. బస్సు బుక్ చేసిన గురుస్వామికి కూడా ఉచిత ప్రయాణం ఫెసిలిటీ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు బుకింగ్ లేదా సీట్ బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ సందర్శించాలని తెలిపారు. పూర్తి వివరాలకు 040 – 23450033, 040- 69440000 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Read More Articles |
YS Sharmila Health Update | వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలింపు