Revanth Redy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్లో అపశృతి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కాన్వాయ్లోని ఆరు కార్లు అతివేగంతో అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని నాలుగు కార్లతో పాటు మరో రెండు మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి.
అయితే ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలువురు మీడియా ప్రతినిధులకు మాత్రం గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు కార్లలోని బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Heart Attack | గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటి.. ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు
Heart attack | గుండెపోటు అని అనుమానం వస్తే ఈసీజీతో పాటు ఈ పరీక్షలు ఎందుకు చేస్తారు ?