Mulayam singh yadav | ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ఉత్తరప్రదేశ్ వెళ్లనున్నారు. ములాయం పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ములాయం సింగ్ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ములాయం మరణవార్త తెలిసి దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇక ములాయం అంత్యక్రియలను అక్టోబర్ 11న ఆయన స్వగ్రామమైన ఇటావా జిల్లాలోని సాయ్ఫాయ్లో నిర్వహించనున్నారు.
ములాయం సింగ్ యాదవ్ మొదటిసారి 1967లో జరిగిన ఎన్నికల్లో జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పటికి ఆయన వయసు 28 ఏండ్లు. ఆ తర్వాత 1977లో 38 ఏళ్లకే మంత్రి అయ్యారు. యూపీకి మూడు సార్లు సీఎంగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగానే ఆయన పనిచేశారు.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?
Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?